సిరా న్యూస్,బోథ్
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
భార్య కాపురానికి రావడం లేదని భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో చోటు చేసుకుంది . బోథ్ ఎస్సై బి రామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బోథ్ మండలంలోని మర్లపెల్లి గ్రామానికి చెందిన గడ్డల రవి (30) సంవత్సరాలు అనే యువకుడికి గత 12 సంవత్సరాల క్రితం మహారాష్ట్రకు చెందిన జ్యోతితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే కుటుంబ కలహాలతో ఈనెల 21న గడ్డల రవి భార్య ఇంటి నుండి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురై శనివారం గడ్డల రవి స్థానిక సాయి నగర్ కాలనీ సమీపంలోని బీడు భూముల్లో పురుగుల మంతు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుని తల్లి అడవి భాయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై తెలిపారు.