సిరాన్యూస్, బోథ్
మర్లపెల్లి , నిగిని గ్రామాలకు ఆర్టీసీ బస్సు ప్రారంభం
ఏడు సంవత్సరాల క్రితం రద్దయిన మర్లపెల్లి , నిగిని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సోమవారం పునరుద్ధరించారు.దీంతో ఆ రూట్ లోని మర్లపెల్లి, నిగిని గ్రామాల రైతులు ఆనందంతో సోమవారం ఆర్టీసీ బస్సును స్వాగతించారు. మర్లపెల్లి లో గ్రామస్తులు, వీడీసీ సభ్యులు బస్సు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అలాగే కంటేగాం గ్రామాల్లో గ్రామస్తులు ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్లను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ తాము ఆర్టీసీ ఆదరిస్తామని, అధికారులు బస్సును రెగ్యులర్గా నడిపించాలని కోరారు.