సిరాన్యూస్,బోథ్
బోథ్లో ప్రపంచ వెదురు దినోత్సవం వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సొనాలలో బుధవారం మేదర కులస్తులు వెదురు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్బంగా వెదురు మొక్కలకు పూజ చేశారు. అనంతరం బోథ్ మండల అధ్యక్షుడు ఊరే గంగాధర్ మాట్లాడారు. వెదురు వల్ల ఉపయోగాలు తెలియ జేస్తూనే మేదరులకు వెదురు ఉచితంగా అందేలా ప్రయత్నాలు చేస్తున్నామనీ అన్నారు. ఈకార్యక్రమములో బోథ్ మండల అధ్యక్షులు ఊరే గంగాధర్, సొనాల ప్రధాన కార్యదర్శి బొమ్మిడి సంతోష్, కోశాధికారి బొమ్మీడి నర్సయ్య, ప్రచార కార్యదర్శి పిల్లి రాజు, గౌరవ అధ్యక్షులు ఊరే పెద్ద భోజన్న, చిన భోజన్నా, ఊరే నారాయణ, ఊరే సుధాకర్, ఊరే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.