సిరాన్యూస్, బోథ్
రెండు ఆటోలు ఢీ… పలువురికి గాయాలు
* రిమ్స్ కు ఐదుగురు తరలింపు
రెండు ఆటోలు ఢీ కొని పది మంది కూలీలకు గాయాలైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని మర్లపెల్లి రోడ్డు వద్ద చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.బోథ్ సమీపంలోని పంటచేలకు కలుపు తీసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా మర్లపల్లి వైపు వెళుతున్న ఆటో, బోథ్ వైపు వస్తున్న ఆటోని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి. బోథ్కు చెందిన కదం ఇందిరా, బారే పద్మ, సంగేపు గంగామణి, సంగేపు అనూష, ముచ్చుల నాగమణి ,మంత్రి నారాయణ లతోపాటు కరత్వాడకు చెందిన షేక్ అగనాస్, కొత్తపల్లికి చెందిన నాగేందర్ లకు గాయాలయ్యాయి. వీరందరిని 108 వాహనం ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఇరువురు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురిని రిమ్స్ ఆసుపత్రికి ఆదిలాబాద్ తరలించారు. వీరికి తీవ్ర గాయాలు కావడంతో అదిలాబాద్ పంపించినట్లు డాక్టర్ ఆదిత్య తెలిపారు. ఎదురుగా వస్తున్న ఆటోలు మరో ఆటోను తప్పించబోయి ఢీకొన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి రాము తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన విషయం తెలవడంతో బోథ్ గ్రామానికి చెందిన వారితో పాటు పలు గ్రామాల వారు ఆసుపత్రికి భారీ సంఖ్యలో తరలివచ్చారు ఆసుపత్రిలో తమ వారి క్షేమ సమాచారం కోసం ఆందోళన పడ్డారు.