సిరాన్యూస్, బోథ్
ఉపాధి హామీ పనుల వద్ద బీఆర్ ఎస్ నాయకుల ప్రచారం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. శుక్రవారం వివిధ గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి తమ పార్టీకి ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని కూలీలకు వివరిస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్ తో పాటు పలు గ్రామాల బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు