boath brs: బోథ్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ద‌హ‌నం

సిరాన్యూస్‌, బోథ్‌
బోథ్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ద‌హ‌నం

గత పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని, అంతేగాక మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా మండల కేంద్రంలోని బస్టాండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ద‌హ‌నం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మహిళ నాయకులను కించపరచడం సరైన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, ఆత్మ మాజీ చైర్మన్ మల్లెపూల సుభాష్, నాయకులు ఎలక రాజు, నరేందర్, ప్రవీణ్ తో పాటు పలు గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *