సిరాన్యూస్,బోథ్
పెద్దవాగు బ్రిడ్జ్ కి సత్వరమే మరమ్మతులు చేపట్టండి: బోథ్ రైతులు
బోథ్ సమీపంలోని పెద్ద వాగుపై నిర్మించిన వంతెన ఓ మూలకు కూనిపోయిందని తక్షణమే మరమ్మతులు చేయకపోతే మరింత కూలిపోయే ప్రమాదం ఉందని ఆ రూట్ లో వెళ్లే రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పగిలిపోయిన బ్రిడ్జి ప్రాంతాన్ని ఆ రూట్ లో వెళ్లే రైతులు సందర్శించారు. బ్రిడ్జికి తక్షణం మరమ్మతులు చేయకపోతే భవిష్యత్తులో నష్టం వాటిలో ఆస్కారం ఉందని వారు పేర్కొన్నారు. ఈ రూట్లో సోనాల జీడిపల్లి టివిటి గ్రామాల ప్రజలు ప్రయాణించడంతోపాటు పంటచేలకు వెళ్లే వ్యవసాయ కూలీలు వ్యాపార నిమిత్తం తిరిగేవారు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అంతే కాకుండా పశువులు వెళితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని వివరించారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త జక్కుల వెంకటేష్, చంద్రమోహన్ రెడ్డి, బాబు డాక్టర్ రాములు, నిమ్మల నరసయ్య, గంగయ్య, గంగాధర్, లంక రమణ తదితరులు ఉన్నారు.