Boath Govt School : ప్రహరీ గోడ లేని ప్రభుత్వ బాలికల పాఠశాల

సిరాన్యూస్‌, బోథ్‌
ప్రహరీ గోడ లేని ప్రభుత్వ బాలికల పాఠశాల
* ఇబ్బందులు ప‌డుతున్న విద్యార్థినులు
* ప‌ట్టించుకోని అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు

ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో అరకోర వసతుల మధ్య చదువులు సాగుతున్నాయి .విద్యార్థుల సంఖ్య సరిపడ గదులు లేకపోవడంతో ఉపాధ్యాయులు తప్పనిసరి పరిస్థితుల్లో విద్యా భవన కొనసాగించాల్సి వస్తున్నది. మరోవైపు పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో ఆ పాఠశాలలో చదివే బాలికలకు ఇబ్బందికరంగా మారింది. ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు అయిన జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ప్రహరీ గోడ లేకపోవడం వల్ల తరచుగా పశువులు వస్తుండడంతో మొక్కలను సైతం నాటించడం కష్టంగా మారిందని ఉపాధ్యాయులు అంటున్నారు. విద్యార్థినుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని సంబంధిత అధికారులకు పలు మార్లు విన్నవించినా ఫలితం కనిపించలేదని తల్లిదండ్రులు వాపోతు న్నా రు. కనీసం ఇప్ప‌టికైనా ప్రహరీ నిర్మించి విద్యార్థుల కు రక్షణ కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *