సిరాన్యూస్, కోహెడ
బాధిత కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేసిన బొబ్బల కనక రెడ్డి
కోహెడ మండలం రాంచంద్రపూర్ గ్రామానికి చెందిన జేరిపోతుల రాములు (దావా) హుస్నాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులను సోమవారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బల కనక రెడ్డి పరామర్శించారు. అనంతరం 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు బీనవేని రాకేష్ యాదవ్, బూత్ కమిటీ అధ్యక్షుడు శనిగరం రామస్వామి, వార్డు సభ్యులు శనిగరం మహేందర్, యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శి జేరిపోతుల సుభాష్, కాంగ్రెస్ నాయకులు వెళ్దండి వెంకటేశం, చిట్టిమల్ల (కోమటి) మహేశ్, శనిగరం అశోక్, జేరిపోతుల సుధాకర్, జకనపెల్లి మల్లయ్య, బోనగిరి అంజయ్య, జేరిపోతుల మైసయ్య, తదితరులు పాల్గొన్నారు.