సిరాన్యూస్, చిగురుమామిడి
శ్మశాన వాటికను బాగు చేయండి: బొమ్మనపల్లి గ్రామస్తులు
ఈనెల 8వ తేదీన కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులకు ధ్వంసమైన బొమ్మనపల్లి శ్మశాన వాటికను బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షం ఈదురుగాలులకు శ్మశాన వాటిక రేకులు విరిగిపోయాయి.గోడలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. స్త్రీ, పురుషులు స్నానం చేసి డోర్లు దెబ్బతిన్నాయి. గ్రామంలో చెరువు వద్ద ఉన్న ప్రధానమైన శ్మశాన వాటిక ఇది. వారం రోజులైనా ఇంతవరకు పునరుద్ధరణ పనులు ఎందుకు చేపట్టడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే ఏ విధంగా దహన సంస్కారాలు నిర్వహించుకోవాలని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి శ్మశాన వాటికను బాగుచేసే పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.