సిరాన్యూస్, చిగురుమామిడి
వాడీవేడిగా బొమ్మనపల్లి గ్రామసభ
* రెండు బోర్లు వేస్తామన్న హామీ ఏమైనట్లు
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ఎప్పుడు నిర్మిస్తారు
* ప్రత్యేక అధికారి గ్రామసభకు ఎందుకు హాజరు కావడం లేదు
* గ్రంథాలయం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు
బొమ్మనపల్లి గ్రామసభ సమస్యలు లేవనెత్తుతూ వాడీవేడిగా జరిగింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో మంగళవారం గ్రామసభను కార్యదర్శి రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రారంభమైన గ్రామసభలో గ్రామ ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న తరుణంలో గ్రామ ప్రత్యేక అధికారి వినయ్ సాయి ఎందుకు గ్రామ సభకు హాజరు కావడం లేదని పలువురు ప్రశ్నించారు. ప్రత్యేక అధికారి లేకుండా తమ సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. 11వ వార్డు లాలయపల్లి, 9 వ వార్డు రాములపల్లి రోడ్డు పల్లె మీద నీటి సమస్య పరిష్కారం కోసం వేసవి కాలంలో వేస్తానన్న రెండు బోర్లు ఏమైనాట్లు అని మామిడి రాజు ప్రశ్నించారు. నిర్మాణ దశలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎప్పుడు నిర్మిస్తారని మాచమల్ల బుజ్జన్న, కిషోర్ ప్రశ్నించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆరోగ్య కేంద్రం నిర్మాణం ఆలస్యం అవుతుందని అన్నారు. గ్రంథాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారని తాల్ల నరేష్ ప్రశ్నించారు. ఇటీవల కురిసిన గాలి వానలకు ధ్వంసమైన స్మశాన వాటిక, రేకులను ఎప్పుడు బాగు చేస్తారని పలువురు ప్రశ్నించారు.మొదటి వార్డ్ లో నీటి సమస్య అధికంగా ఉందని బోర్ కు కనీసం చేతి పంపు నాయనా ముగించాలని గంగు అనిల్ ప్రశ్నించారు.ప్రత్యేక అధికారుల పాలనలో పనులు జరగడం లేదంటూ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.