సిరాన్యూస్,బీజాపూర్;
చత్తీస్ ఘడ్ ఆడవులు మరోసారి రక్తమోడ్చాయి. మావోస్టులు అమర్చిన బూబీ ట్రాప్స్ గోతిలో పడి గ్రామస్తుడికి గాయాలు అయ్యాయి. బీజాపూర్ జిల్లా కావడ్ గావ్ అటవీ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు బూబి ట్రాప్స్ అమర్చారు. సిఆర్పిఎఫ్ జవాన్లు గాయాల పాలైన గ్రామస్తుడిని మోసుకు వెళ్లి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.