ఓటర్ వెరిఫికేషన్ పకడ్బందీగా నిర్వహించాలి
నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు షేక్ అజీజ్
సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజ్ నందు మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ నేత అబ్దుల్ జలీల్ నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు కరిముల్లా లు 42, 43 వ డివిజన్ ల నేతలు, బూత్ కన్వీనర్ లు, బీ ఎల్ ఏ లు, ఇన్ఫ్లుఎన్సర్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూబూత్ కన్వీనర్ అంటే పదవి కాదని, అదొక బాధ్యతని, ఓటర్ వెరిఫికేషన్ పకడ్బందీగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. దొంగ ఓట్లను నిర్మూలించలేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ఒకటికి పది సార్లు ఓటర్ లను వ్యక్తిగతంగా కలవడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. ఓటర్ తో వ్యక్తిగత సంబంధాలు ఉంటేనే అత్యధిక ఓట్లు సాధించగలమని అన్నారు.