రైతులకు వాల్టా చట్టం పై అవగాహన
ప్యారా లీగల్ వాలంటర్ ఎం శ్రీనివాస్ యాదవ్
సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
అనుమతి లేకుండా బోరు బావులు వేయరాదనీ ప్యారా లీగల్ వాలంటర్ ఎం శ్రీనివాస్ అన్నారు, సోమవారం పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని పెద్ద కార్పాముల రైతు వేదిక లో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన, వ్యవసాయ న్యాయ సలహా కేంద్రంలో రైతులకు వాల్టా చట్టం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీరు గురించి 2004 సంవత్సరాలకి ముందు ఉన్నటువంటి బోరు బావులను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.2004 తర్వాత ఎవరైనా వ్యవసాయ భూమిలో బోర్ వెయ్యడానికి లేదా బావినీ తీయడానికి
అనుమతుల కోసం మండల తహసిల్దార్ కు దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి ఇచ్చే ముందు భూగర్భ జలా శాఖ నుండి ఇక్కడ నీటి లభ్యత ఉంది అని సర్టిఫికెట్ జారీ చేయాలి. తర్వాత విద్యుత్తు కలెక్షన్ ఇవ్వడానికి వీలవుతుందని విద్యుత్ శాఖ వారి సర్టిఫికెట్ తప్పనిసరి ,ఇలా అనుమతి ఇచ్చిన తర్వాతనే బావికానీ, బోరు కానీ, వెయ్యాలి. అనుమతి లేకుండా వేసినట్లయితే
దాన్ని శాశ్వతంగా మూసివేసి అధికారం తహసిల్దార్ కు కలదు. కావున ప్రతి రైతు కూడా చట్టం పై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు వట్టేపు యాదగిరి, రెడ్ లక్ష్మయ్య, దస్తగిరి, కృష్ణాయ, బాను, రామస్వామి , శేఖర్,తదితరులు పాల్గొన్నారు.