గురుకులంలో సీటు రాలేదని బాలుడు ఆత్మహత్య

సిరా న్యూస్,మేడ్చల్;
ఓ పేదింటి కుటుంబానికి చెందిన 12ఏళ్ల బాలుడు ఐదవ తరగతి గురుకులలో అడ్మిషన్ రాలేదనే మనస్తాపంతో ఊరి వేసుకొని బలవన్మరణం. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లోని శివారెడ్డిగూడ లో సంఘటన జరిగింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లోని శివారెడ్డి గూడలో కూలీ పని చేసుకుంటూ నివాసం ఉంటున్న ఈదుల గంటి ఇందిర కు రాజు ఆమె 12ఏళ్ల కుమారుడు వున్నాడు. బాలుడు రాజు బొల్లారంలోని గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్ లో ఉంటూ నాలుగో తరగతి చదివాడు.
ఐదో తరగతిలో బొల్లారం గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్ వసతి లేదని తల్లి ఇందిర మహబూబాబాద్ లోని గురుకుల పాఠశాలలో అడ్మిషన్ కోరకు రాజును తీసుకొని వెళ్ళింది.
మహబూబాబాద్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి అడ్మిషన్ కోరకు రాజును అక్కడి సిబ్బంది వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పక పోవడంతో అడ్మిషన్ రాదు. ఎక్కడైనా వేరే స్కూల్ లో చేర్పించంది అని సిబ్బంది చెప్పాడు ..
మహబూబాబాద్ నుండి ఘట్ కేసర్ లోని శివారెడ్డి గూడ కి ఇందిర, రాజు వచ్చారు. అడ్మిషన్ రాలేదని తల్లితో చెప్పుకుంటూ బాధ పడిన రాజు మనస్తాపంతో ఉరి వేసుకుని చనిపోయాడు. పనికి వెళ్లి వచ్చిన ఇందిర కుమారుడు రాజు ఉరి వేసుకొని విగత జీవిగా ఉన్నాడు. సమాచారం అందుకున్న ఘట్ కేసర్ పోలీసులు బాలుడు రాజు డెడ్ బాడీని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…
========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *