సిరా న్యూస్,సనత్ నగర్;
సనత్ నగర్ పరిధిలో విషాదం జరిగింది. జీహెచ్ఎంసి స్విమ్మింగ్ పూల్ లో పడి 12 ఏళ్ల బాలుడు కార్తికేయ మృతి చెందాడు. స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా… బాల్ పడటంతో తీసుకురావడానికి వెళ్ళి కార్తికేయ మృతి చెందాడు. స్విమ్మింగ్ పూల్ బంద్ ఉండగా.. గోడ దూకి వెళ్లినట్లు స్నేహితులు చెబుతున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ కి తరలించారు. సనత్ నగర్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసారు.