సిరా న్యూస్,రంగారెడ్డి;
అత్తాపూర్ లో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తో 11 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. సంక్రాంతి పండుగ రోజు ఓ కుటుంబం లో తీరని విషాద ఛాయలు మిగిలాయి. గాలి పటాలు ఎగుర వేయడానికి తనిష్క్. తన స్నేహితుల తో కలిసి మిద్ద మీదకు వెళ్లాడు. గాలి పటాలు ఎగుర వేస్తూ విద్యుత్ గాతానికి గురైయాడు. అక్కడే కుప్పకూలి పోయిన తనిష్క్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతిచెందాడు. తమ గారాల పట్టి లేకపోవడం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.