Boyin Pally Vinod Kumar:వైస్ ఎంపీపీ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన బోయిన్ పల్లి వినోద్ కుమార్

సిరాన్యూస్‌, చిగురుమామిడి
వైస్ ఎంపీపీ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన బోయిన్ పల్లి వినోద్ కుమార్

చిగురుమామిడి వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి తండ్రి సంజీవరెడ్డి గురువారం మరణించారు. ఈ విష‌యం తెలుసుకున్న కరీంనగర్ బిఆర్ఎస్ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ శుక్ర‌వారం వారి స్వగ్రామం సీతారాంపూర్‌కు వెళ్లి కుటుంబ స‌భ్యుల‌ను  పరామర్శించారు. అంత్యక్రియాల్లో పాల్గొని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రధానోపాధ్యాయులుగా, ఎంఈఓ గా ఆయన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన లేకపోవడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్యామకూర సంపత్ రెడ్డి, ముస్కుల కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *