సిరా న్యూస్, జైనథ్:
బ్రెయిన్ ఇన్ఫెక్షన్… ఆపై కోమా
+ 10 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళ
+ డబ్బులు లేక దాతల కోసం ఎదురుచూపులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సాంగ్వి–కే గ్రామానికి చెందిన బొల్లి రాకేష్ భార్య ప్రియాంక నాగ్పూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గత 10 రోజులుగా చికిత్స తీసుకుంటోంది. బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో కోమాలోకి వెళ్లిపోవడంతో వైద్యులు ప్లాస్మా తెరపీ చేయాలని సూచించారు. కాగా నిరుపేద కుటుంబానికి చెందిన రాకేష్ వైద్యం కోసం ఇప్పటికే రూ. 4 లక్షలు ఖర్చు చేసాడు. ప్లాస్మా తెరపీ కోసం మరో రూ. 6లక్షల వరకు అవసరం ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో, దాతల కోసం ఎదురుచూస్తున్నాడు. దాతలు ఎవరైన స్పందించి, తన ఫోన్ పే నంబర్ 9640586643 కి డబ్బులు అందించాలని ఆయన వేడుకుంటున్నాడు.