Brain stroke: బ్రెయిన్ స్ట్రోక్ తో ఒకరి మృతి

సిరా న్యూస్, నిర్మల్:

బ్రెయిన్ స్ట్రోక్ తో ఒకరి మృతి

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ఆద్గాం గ్రామానికి చెందిన బర్కుంట నరేష్ (25) బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నరేష్ తన కూతురు పుట్టు వెంట్రుకల ఫంక్షన్ కోసం అవసరమైన మేకలు కొనుగోలు చేయడానికి, శనివారం మేకల అంగడికి వెళ్ళాడు. ఇంటికి తిరిగి రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబీకులు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, తాము చికిత్స చేయలేమని వేరే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని వారు సూచించారు. దీంతో హుటాహుటిన అతన్ని నిజామాబాద్ కు తరలించారు. గమనించిన వైద్యులు అప్పటికే నరేష్ మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *