BRS:ఆదిలాబాద్ బీఆర్ఎస్ కు మ‌రో బిగ్ షాక్

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ఆదిలాబాద్ బీఆర్ఎస్ కు మ‌రో బిగ్ షాక్
* కాంగ్రెస్ లోకి ఇద్దరు కౌన్సిలర్లు
* మంత్రి సీతక్క, టీపీసీసీ కార్యదర్శి సత్తుమల్లేష్ సమక్షంలో చేరిక
* కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని స్పష్టం

ఆదిలాబాద్ మునిసిపాలిటీలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. బీజేపీతో చేతులు కలిపి మైనారిటీ వైస్ చైర్మన్ పై అవిశ్వాస ప్రయత్నాలు చేస్తున్న జోగురామన్న, జోగు ప్రేమేందర్ ల తీరును నిరసిస్తూ కౌన్సిలర్లు కారుపార్టీకి గుడ్ బై చెప్పి చేయందు కుంటున్నారు. బుధ‌వారం మరో ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి సీతక్క, టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేష్ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ ఆదిలాబాద్ మునిసిపాలిటీ ఫ్లోర్ లీడర్ 45వ వార్డు కౌన్సిలర్ మున్సిప‌ల్ కౌన్సిల్ జిల్లా అధ్య‌క్షులు బండారు సతీష్, 44వ వార్డు కౌన్సిలర్ షహనాజ్ బేగం తనయుడు ఇమ్రాన్ కాంగ్రెస్ లో చేరారు. జోగురామన్న, పాయల్ శంకర్ ల తీరుపై ఆదిలాబాద్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఆదిలాబాద్ డెవలప్ మెంట్ కంది శ్రీనన్ననాయకత్వంలోనే సాధ్యమని ఈ సందర్భంగా పార్టీలో చేరిన కౌన్సిలర్లు అన్నారు. తాజా చేరికలతో కాంగ్రెస్ పార్టీ బలం 18కి పెరగ్గా, బీఆర్ఎస్ కు వరుస షాకులు తగిలి బ‌లం త‌గ్గుతోంది. ఛైర్మన్ పై అవిశ్వాసానికి సిద్దమని పలువురు కౌన్సిలర్లు కంది శ్రీనివాసరెడ్డిని సంప్రదించినట్లు తెలిసింది. మరో ఐదుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. చేరిక కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కౌన్సిలర్ కల్లాల శ్రీనివాస్, నాయకులు డేరా కృష్ణారెడ్డి, అఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *