ఈటల సమక్షంలో భాజపా లో చేరిన బిఆర్ఎస్ కౌన్సిలర్లు

 సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ భాజపా అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి చెందిన బిఆర్ఎస్ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ నాయకులు మల్కాజిగిరి పార్లమెంట్ భాజపా ఎంపి అభ్యర్థి ఈటలరాజేందర్ సమక్షంలో భాజపాలో చేరారు. రికలు..
ఈ సందర్భంగా బిఆర్ఎస్ కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్, సకరబోయిన రజిత వెంకటేష్ లను ఈటల రాజేందర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, అసెంబ్ల కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్ సరస్వతి మోహన్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు కృష్ణా గౌడ్, మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *