BRS Enugu Krishna Reddy: అబద్ధపు మాటలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏనుగు కృష్ణారెడ్డి

సిరాన్యూస్‌, ఇచ్చోడ‌
అబద్ధపు మాటలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏనుగు కృష్ణారెడ్డి
* మండ‌ల కేంద్రంలో రైతుల రాస్తారోకో

అబద్ధపు మాటలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దెనెక్కార‌ని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏనుగు కృష్ణారెడ్డి అన్నారు.ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రహదారిపై రైతులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదని తెలిపారు. అన్ని సక్రమంగా ఉండి కూడా చాలా మంది రైతులకు డబ్బులు జమ కాలేదన్నారు. బేషరతుగా పంట రుణాలు మాఫీ చేయాలన్నారు. ఒకవైపు రైతుబంధు రాక, మరోవైపు రుణమాఫీ కాక అన్నదాత ఆవేదనలో ఉన్నాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *