సిరాన్యూస్, ఆదిలాబాద్
ఎల్ఐసీ సామల లక్ష్మీ నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి జోగురామన్న
ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన ఎల్ఐసీ సామల లక్ష్మీనారాయణ గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న శాంతినగర్ లోని తన నివాసానికి చేరుకొని పార్థివ దేహాన్ని సందర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రలాద్, కొమ్ర రాజు, నవతే శ్రీనివాస్ ఉన్నారు.