సిరాన్యూస్, ఖానాపూర్
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై ఖానాపూర్లో సంబరాలు
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై హర్షిస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు.ఖానాపూర్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా బయటికి వచ్చిందన్నారు. న్యాయం గెలిచింది… సుప్రీంకోర్టు ముందు నిలువని ,అబద్దాల ప్రచారాలు.. జై బిఆర్ఎస్ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మండల పట్టణ తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.