సిరా న్యూస్,హైదరాబాద్;
మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అయన కుమారుడు భాస్కర్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నేపధ్యంలో బీఆర్ఎస్ నేతలు బంజారా హిల్స్ లో పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.వారిని పోచారం నివాసం లోపటికి అనుమతించకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోచారం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండటంతో బీ అర్ ఎస్ లోపటికి అనుమతించలేదు.