సిరా న్యూస్,కరీంనగర్;
భూ కబ్జా కేసులో అరెస్ట్ అయిన బిఆర్ఎస్ కు చెందిన కార్పొరేటర్ తోటరాములు, పార్టీ నేత చీటీ రామారావు ను పోలీసులు కష్టడిలోకి తీసుకున్నారు. వారిద్దరిని వారం రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాజిరెడ్డి చెందిన భూమి కబ్జా కేసులో ముగ్గురిపై నమోదు అయింది. మూడవ వ్యక్తి పరారీలో వున్నాడు. అరెస్ట్ అయిన ఇద్దరిని కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు 24 గంటల కస్టడికి అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పోలీసులు ఉదయమే కస్టడికి తీసుకున్నారు.