-బిఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా చెక్కులు పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ
మంథని నియోజకవర్గ ఇంచార్జి పుట్ట మధూకర్
సిరా న్యూస్,మంథని;
కార్యకర్తల కు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జ్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.
బుధవారం మంథని పట్టణంలోని రాజగృహలో బిఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా చెక్కులను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పంపిణీ చేశారు.
కాటారం మండలం దామెరకుంట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కనుకుట్ల సమ్మయ్య మరియు మహముత్తారం మండలం బోర్లగూడెం గ్రామానికి చెందిన గండ్ర కిషన్ రావు లు ప్రమాదంలో మరణించగ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మంజూరైన చెక్కులను బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏగోలపు శంకర్ గౌడ్, నాయకుడు తగరం శంకర్ లాల్ లు పాల్గొన్నారు.