BRS Protest: ఆదిలాబాద్ లో మోడీ దిష్టిబొమ్మ దహనం

సిరా న్యూస్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ లో మోడీ దిష్టిబొమ్మ దహనం

+ బిఆర్ఎస్ కార్యాలయం నుండి కలెక్టర్ చౌరస్తా వరకు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ

+ కవిత అరెస్టుపై భగ్గుమన్న బిఆర్ఎస్ శ్రేణులు

ఈడీ పేరుతో ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామికమని ఆదిలాబాద్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్న వ్యాఖ్యానించారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని బిఆర్ఎస్ కార్యాలయం నుండి కలెక్టర్ చౌరస్తా వరకు బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి నల్ల జెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగడంతో, స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఈడీని ప్రతిపక్షాలను వేధించడానికి అస్త్రంగా వాడుకుంటుందని విమర్శించారు. పరిణామాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో బిజెపికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *