సిరాన్యూస్, ఓదెల
గట్టయ్య కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ కుమార్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామానికి సీనియర్ యువజన నాయకుడు మద్దెల గట్టయ్య యాదవ్ తండ్రి ఇటీవల మృతి చెందారు. శుక్రవారం వారి కుటుంబాన్ని టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. చిరుమిల్ల రాకేష్ కుమార్ పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్రె దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ కాల్వ శ్రీరాంపూర్ మేడుదుల రాజ్ కుమార్, ఉప్పు శివ కుమార్, బోయిని మనోజ్, విద్యాసాగర్, తదితరులు ఉన్నారు.