సిరా న్యూస్, డిజిటల్:
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి బాయిన్వార్ గంగారెడ్డి…
– కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిక
బిఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి బాయిన్వార్ గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి, ఈ మేరకు గంగా రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన తో పాటు మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న సన్నిహితుడు, దీపాయిగూడ గ్రామానికి చెందిన పోతారెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జోగు రామన్న ఓటమి తర్వాత బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి మొదలైన వలసలు రోజురోజుకు వేగం పుంజుకుంటూ ఉన్నాయి. పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల వరకు వలసలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఖాళీ చేస్తామని వారు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దుర్గం రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు తుమ్మల వెంకట్ రెడ్డి, ముడుపు దామోదర్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్ది, గిమ్మ సంతోష్ రావు, బోనం మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.