సిరాన్యూస్, ఓదెల
తెలంగాణ తల్లి విగ్రహం నెలకొల్పాలి : బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు మ్యడగొని శ్రీకాంత్ గౌడ్
సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటే చారిత్రక న్యాయమని బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు మ్యడగొని శ్రీకాంత్ గౌడ్ అన్నారు. బుధవారం ఓదెలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అస్తిత్వ వైభవానికీ, స్వరాష్ట్ర ప్రతిపత్తికీ, స్వాభిమానానికీ, సాధికారతకు ప్రతీక తెలంగాణ తల్లి. ప్రస్తావన ఈనాటిది కాదు, తెలంగాణ రైతాంగ పోరాటం కాలంలోనే దాశరథి, రావెళ్ళ వెంకటరామారావు వంటి కవులెందరో తెలంగాణ తల్లిని ప్రస్తుతిస్తూ పద్యాలూ, పాటలూ రచించారని అన్నారు.తెలంగాణ అస్తిత్వ వైభవానికీ, స్వరాష్ట్ర ప్రతిపత్తికీ, స్వాభిమానానికీ, సాధికారతకు ప్రతీక తెలంగాణ తల్లి అని తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన తెలంగాణ తల్లి భావన తిరిగి మలిదశ తెలంగాణ ఉద్యమంలో పునర్జీవం పొందిందన్నారు. సమైక్యవాదులు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు విరుద్ధంగా, సమైక్య రాష్ట్ర ప్రతీకగా తెలుగుతల్లిని నిలిపే ప్రయత్నం చేశారన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బుద్ధిజీవులూ, సాహిత్యకారులూ, కళాకారులూ తెలంగాణ తల్లి రూపురేఖలను గురించి చర్చించటం ప్రారంభించారన్నారు. ఉద్యమకారులు స్వచ్ఛందంగా తెలంగాణ ఎల్లెడలా వేలాది విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు. కనుక తెలంగాణ తల్లి ఈ మట్టిలోనుంచి, తెలంగాణ ఉద్యమ భావోద్వేగాల నుంచి పుట్టిన అస్తిత్వ ప్రతీకఅని తెలిపారు. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండటమే చారిత్రక న్యాయం అని చెబుతున్నారు.