సిరా న్యూస్,విజయవాడ;
రాష్ట్రంలో లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులను నిబంధనలను సరళీకృతం చేస్తా మని మున్సిపల్,పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు..ఇదే సమయంలో నిబం ధనలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవ హరిస్తామని స్పష్టం చేసారు. రాష్ట్రం లో పలు బిల్డర్ల అసోసియేషన్ ప్రతి నిధులతో విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించా రు..ఈ సమావేశానికి సీఆర్డీయే కమి షనర్ కాటంనేని భాస్కర్, అమరావ తి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ లక్ష్మీ పార్ధసారధితో పాటు క్రెడాయ్,నరెడ్కో,బిల్డర్స్ అసోసి యేషన్ ఆఫ్ ఇండియా అసోసియే షన్ ల నుంచి ప్రతినిధులు హాజ రయ్యారు..2014 నుంచి 2019 వరకూ బిల్డర్లకు స్వర్ణయుగంగా ఉందని…కానీ గత ప్రభుత్వం తీరుతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేసారు…రాబోయే రోజుల్లో మళ్లీ రియల్ ఎస్టేట్ రంగా నికి ఊపు వచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని అసోసియేషన్ల ప్రతిని ధులు కోరారు..నాలా టాక్స్,వేకెంట్ ట్యాక్స్,ఫైర్ అనుమతులు,ఎయిర్ పోర్ట్,టీడీఆర్ బాండ్ల విషయాల్లో తమకు ఎదురవుతున్న ఇబ్బందుల ను మంత్రి నారాయణ దృష్టికి తీసు కొచ్చారు..ఆన్ లైన్ అనుమతుల జారీలో ఉన్న సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు..సమా వేశం ముగిసిన తర్వాత మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు.టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా నిబంధనల జారీని సరళీకృ తం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు మంత్రి నారాయణ అనుమతుల విషయంలో ఇతర రాష్ట్రల్లో అమలవుతున్న నిబంధ నలను అధ్యయనం చేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అధికారుల బృందాలను పంపి స్తున్నామన్నారు…టౌన్ ప్లానింగ విభాగంపై సీఎం చంద్రబాబు స్పెషల్ డ్రైవ్ చేయాలని తనకు చెప్పారన్నా రు…ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నా రు..ఇకపై ప్రతివారం ఒక మున్సిపా ల్టీలో టౌన్ ప్లానింగ్ దరఖాస్తుల పరిష్కారానికి డ్రైవ్ చేస్తామన్నా రు..బిల్లర్లకు రెవెన్యూ పరమైన అంశాల్లో ఇబ్బందులు ఎదురవు తున్నందున టౌన్ ప్లానింగ్ విభాగా న్ని రిజిస్ట్రేషన్ విభాగంతో అనుసం ధానం చేస్తామని చెప్పారు..ఇప్పటికే దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో చర్చించినట్లు మంత్రి తెలిపారు.