Bus : బస్సు బోల్తా.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు

తలమడుగు, సిరా న్యూస్ 

ప్రయాణికులకు స్వల్ప గాయాలు

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని చెర్లపల్లి, ఝరి గ్రామాల మధ్య బస్సు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు పెద్దగా లేకపోవడంతో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం ఝరి, పున్నగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. రోడ్డు మార్గం ఇరుకుగా ఉండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఇదివరకే అధికారులకు ప్రయాణికులు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *