సిరా న్యూస్,నల్లగొండ;
నల్లగొండ బైపాస్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటనలో మంటల్లో ఓ ప్రయాణికుడు సజీవ దహనం అయ్యాడు. పట్టణ సమీపంలోని నార్కెట్పల్లి-అద్దంకి హైవేపై.. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో ట్రావెల్స్ బస్సు దగ్ధం అయింది. హైదరాబాద్ నుంచి చీరాల వైపు 38 మంది ప్రయాణికులతోబస్సు బయలుదేరింది. ఏసీ మిషన్ నుంచి మంటలు రావడంతో డ్రైవర్ బస్సును నిలిపేసి, ప్రయాణికులను దింపివేసాడు. బస్సు నిమిషాల్లోనే దగ్ధమైంది.