నాణ్యత గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

అదనపు కలెక్టర్ పి.రాంబాబు

సిరా న్యూస్,జగిత్యాల;

నాణ్యత గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. గురువారం రోజున జిల్లా లోని బీమారం, మేడిపల్లి మండలాల్లోని భీమారం, లింగంపేట, మేడిపల్లి, కొండాపూర్ గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల నుండి కొనుగోలు చేసే వరి పంటను నాణ్యత గల వరి నీ కొనుగోలు చేయాలని కేంద్రం ఇంఛార్జి లను ఆదేశించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న రిజిస్టర్ లను అడనపై కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో నీడ ఏర్పాటు చేయాలని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అన్నారు. కేంద్రంలోని వారికి ఓఆర్ఎస్ పాకెట్స్ లను పంపిణీ చేశారు. ఆయన వెంట ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *