సిరా న్యూస్,అమరావతి;
ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన త్యాగరాజులకు ప్రాధాన్యంఈ నెలాఖరులోగా భర్తీ చేయనున్న కార్పొరేషన్ చైర్మన్ పదవులకు లిస్టు రెడీ అవుతోందని టీడీపీ వర్గాల సమాచారం. ఐతే ఇందులో ఎవరిరెవరి పేరు ఉంటుందనే ఉత్కంఠ పార్టీ శ్రేణులకు నిద్రపట్టనీయడం లేదు. ముఖ్యంగా ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన త్యాగరాజులకు ముందుగా ప్రాధాన్యమివ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్యే, ఎంపీ పదవులపై ఆశతో గత ఐదేళ్లుగా నియోజకవర్గాల్లో కష్టపడిన నేతలు ఎందరో చివరి నిమిషంలో అధినేత నిర్ణయంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.