Bypass Road: బైపాస్ రోడ్డు వద్దని రైతుల రాస్తారోకో

బేల, సిరా న్యూస్ 

బైపాస్ రోడ్డు వద్దని రైతుల రాస్తారో

+వ్యవసాయం కుంటుపడుతుందని ఆవేదన

బైపాస్ రోడ్డు కోసం మా భూములివ్వమని రైతులు నిరసన చేపట్టారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలంలోని  శంషాబాద్, దోప్టాల , మొబత్ పూర్ రైతులు రోడ్డెక్కి రాస్తారోక చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. రహదారి ప్రారంభమైన సందర్భంలో ఎక్కడా లేని బైపాస్ రోడ్డు బేల మండలంలోనే వేయాలని ఎందుకు అనుకున్నారని మండిపడుతున్నారు. తమవి సారవంతమైన భూములు అందుకే మా భూములివ్వమని తెగేసి చెప్పారు. 353 కిలోమీటర్ల రహదారి బేల మండలంలో 4.5 కిలోమీటర్లు వెళ్తుంది. ఇక్కడ బైపాస్ చేపట్టాలని నిర్ణయించడం సరైందని కాదని పేర్కొంటున్నారు. అధికారులు బైపాస్ నిర్మాణం చేపట్లాలనే ఉద్దేశాన్ని మానేయాలని హితవు పలికారు. మా భూములే మాకు జీవనాధారమైనందున వ్యవసాయం కుంటుపడుతుందని చెప్పారు. బైపాస్ నిర్మాణంతో చాలా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *