Bypass Road: ఫలించిన రైతుల నిరాహార దీక్ష

సిరాన్యూస్‌, బేల‌
ఫలించిన రైతుల నిరాహార దీక్ష
* బైపాస్ ర‌హ‌దారి రద్దు
* దీక్ష‌ను విర‌మించిన రైతులు
గత 56రోజుల నుండి బై పాస్ ను రద్దు చేయాలని రైతులు నిరాహార దీక్ష చేపట్టారు. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధ‌వారం జాతీయ రహదారి జిల్లా డిఈ రైతుల దీక్ష శిబిరానికి వచ్చి బై పాస్ ను రద్దు చేస్తున్నామని చెప్పడంతో బేల‌, శంషాబాద్ మాజీ సర్పంచ్లు రైతుల దీక్షకు నిమ్మ రసం ఇచ్చి విరమణ చేయించారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ గత 56 రోజుల నుండి చేపడుతున్న దీక్ష ను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బైపాస్ రోడ్డు అంతరాష్ట్ర రహదారి 353బి బేల మండల కేంద్రం నుండి బైపాస్ దాదాపుగా 4.50 కిలోమీటర్లు వెళ్తుంది.ఈ బైపాస్ గుండా భూములు కోల్పోతున్న, శంషాబాద్, డాప్తాల, మొబత్ పూర్ రైతులు రోడ్డుపైన వస్తామని అందుకే ఈ దీక్ష ను చేశామని అన్నారు. నాలుగు వరుసలా రహదారికి తాము అడ్డుకోమని కానీ ఎక్కడి నుండి ఈ రహదారి ప్రారంభమైందో ఆ ప్రాంతాల్లో ఎక్కడ కుడా బైపాస్ ఊసే లేదు. కేవలం బేల మండలానికి వచ్చే సరికి బైపాస్ రోడ్డును చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ ఉండే రైతులు చిన్న సన్న కారు రైతులు మా యొక్క జీవనదారం వ్యవసాయం అని అన్నారు.ఎక్కువ మంది సన్న చిన్న కారు రైతులు వ్యవసాయ భూమి పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని దింతో ఉన్న భూములు కోల్పోతే జీవనదారం ఎలా సాగుతుందని పేర్కొన్నారు. బై పాస్ రోడ్డును రద్దు చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *