సిరాన్యూస్, బోథ్
బైపాస్ రోడ్డు ఇలా.. బడికి వెళ్ళేది ఎలా..?
* బురదమయమైన కన్గుట్ట రోడ్డు
* ఇబ్బందుల్లో ప్రజలు.. పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలో ఉన్న బైపాస్ రోడ్డు గురువారం రాత్రి కురిసిన వర్షాలకు బురదమయంగా మారింది. ఫలితంగా అడుగు తీసి అడుగు వేయడమే కష్టతరమైంది. అయితే ఈ రోడ్డు గుండా గ్రామంలోని పాఠశాలకు విద్యార్థులు వెలుతుంటారు. అయితే పాఠశాలకు వెళ్లాలంటే బురద లో జారిపడే అవకాశాలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పాఠశాల వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని పలువురు కోరుతున్నారు.