మారుతున్న పొత్తుల లెక్కలు

సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో పార్టీల మధ్య పొత్తులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. మరోవైపు బిజెపి సైతం ఈ కూటమిలోకి రానుంది. సీట్ల సర్దుబాటు ప్రక్రియ సైతం తుది దశకు చేరుకుంది. దాదాపు ఖరారైనట్లు సమాచారం. మూడు పార్టీలు ఉమ్మడి వేదికగా పొత్తు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.అనేక ప్రతిపాదనలు, చర్చల అనంతరం దాదాపు అభ్యర్థుల జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. జనసేనతో గతంలో పూర్తయిన సీట్ల ప్రతిపాదనలు..బిజెపి రాకతో తారుమారైనట్లు తెలుస్తోంది. మూడు పార్టీల మధ్య పొత్తులు కుదరడంతో.. 2014 నాటి అంశాలు రిపీట్ అయ్యే అవకాశం ఉంది.రెండు రోజుల్లో పొత్తులపై ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.జనసేన 30 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. గతంలో 25 నుంచి 28 అసెంబ్లీ స్థానాలు జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 30 అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా చూసుకోవాలని పవన్ భావించారు. అందుకే చంద్రబాబుపై ఒత్తిడి పెంచారు. చంద్రబాబు సైతం సమ్మతించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని పవన్ రాజమండ్రి పర్యటనలో స్పష్టం చేశారు. బిజెపి పొత్తులో కలిసి వస్తుందని.. కానీ వారిని ఒప్పించే బాధ్యత తీసుకున్నట్లు పవన్ వెల్లడించారు. బిజెపికి అంశం పైన ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.బిజెపికి ఎంపి స్థానాలు కీలకంగా కావడంతో.. పొత్తులో భాగంగా సింహభాగం లోక్ సభ స్థానాలు ఆ పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఐదు ఎంపీ స్థానాలతో పాటు 12 ఎమ్మెల్యే స్థానాలను బిజెపికి పొత్తులో భాగంగా కేటాయించినట్లు తెలుస్తోంది. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం జనసేనకు కేటాయించారు. బిజెపికి విశాఖ,రాజమండ్రి, నరసాపురం, విజయవాడ, తిరుపతి స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించారు. 2014 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా 13 అసెంబ్లీ సీట్లను బిజెపికి కేటాయించారు. ఈసారి మాత్రం 12 స్థానాలను ఖరారు చేశారు. అందులో గతంలో కేటాయించిన స్థానాలు కొన్ని మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే మూడు పార్టీల మధ్య పొత్తులు కొలిక్కి వచ్చాయని, సీట్ల సర్దుబాటు ప్రక్రియ సైతం పూర్తయిందని తెలుస్తోంది.ప్రస్తుతం పవన్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వాటిని ముగించుకుని ఢిల్లీ వెళ్ళనున్నారు. పనిలో పనిగా తన జిల్లాల పర్యటనలను ఎక్కడికక్కడే జనసేన స్థానాలపై స్పష్టత ఇస్తున్నారు. పెందుర్తి, భీమిలి,గాజువాక, ఎలమంచిలిలో ఇన్చార్జిలను ప్రకటించారు. తూర్పుగోదావరి కు సంబంధించి గతంలోనే రాజోలు, రాజానగరం ప్రకటించగా.. రాజాగా రాజమండ్రి రూరల్ స్థానాన్ని సైతం జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అయితే ఏది ఏమైనా మరో రెండు రోజుల్లో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీ చేస్తుంది? అనే దానిపై ఫుల్ క్లారిటీ రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *