బద్వేలు ప్రాంత ప్రజలకు రైలు కూత వినిపించేనా.

నాలుగు దశాబ్దాలుగా ప్రజల కల ఇప్పటికీ నెరవేర లేదు
ఈ విషయంపై ప్రజాప్రతినిధుల మౌనం
 సిరా న్యూస్,బద్వేలు;
బద్వేల్ మీదుగా కొత్త రైల్వే లైన్ ప్రసక్తి లేకుండా పోయింది గత నాలుగు దశాబ్దాలుగా పైబడి బద్వేల్ మీదుగా రైలు మార్గం వస్తుందని ప్రజలు ఎంతో ఆశపడ్డారు ప్రజలకు ఎదురుచూపులే తప్ప వారి ఆశ ఇప్పటికీ నెరవేరలేదు రైలు మార్గం అవుతుందని పెట్టుకున్న ప్రజల నమ్మకం క్రమేపి సన్నగిల్లుతుంది గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు భాకరాపేట – గిద్దలూరు వరకు బద్వేలు మీదుగా రైల్వే మార్గం ప్రతిపాదనలు చేశారు ఆ ప్రతిపాదన కేవలం ప్రకటనలకే పరిమితం అయింది దీంతో రైల్వే లైన్ పరిస్థితి ఇప్పటికీ ఎటు తేలడం లేదు బిజెపి పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో బద్వేలు కు రైలు మార్గం ప్రస్తావన ఇప్పటికీ తీసుకురాలేదు రైలు మార్గం కోసం సర్వేలైతే గతంలో చేశారుగాని ఆ తర్వాత ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి ఈ రైలు మార్గం వెళ్లే ప్రాంతాలవారు కొత్త రైల్వే మార్గం ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్నారు తమ ప్రాంతం మీదుగా రైలు వస్తే రాకపోకలు ఆర్థిక వ్యాపార రంగాల పరంగా అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్న వారి ఆశలు అడియాశలు అయ్యాయి గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఉన్న రోజులు రైల్వే బడ్జెట్లో కేవలం లక్షల రూపాయలు మాత్రమే ఈ మార్గానికి సంబంధించి నిధులు కేటాయిస్తూ వచ్చారు ప్రవేట్ సంస్థలకు సర్వే పనులు అప్పగించి కొంతవరకు సర్వే చేయించినట్లు గతంలో రైల్వే వర్గాలు ప్రకటించాయి భాకరాపేట – గిద్దలూరు రైల్వే మార్గం ఏర్పాటయితే బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని బద్వేలు నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని మండలాల గుండా వెళుతుంది దీనివల్ల భాకరాపేట సిద్ధవటం అట్లూరు మీదుగా బద్వేలు బి కోడూరు పోరుమామిళ్ల కాశి నాయన మండలాలను తాకుతూ కలసపాడు మండలం నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు వరకు రైల్వే లైన్ వెళుతుందని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు చీని కాయలను చెన్నై తో పాటు బెంగళూరు ముంబై నాగపూర్ తదితర నగరాలకు రవాణా అనువుగా ఉంటుందని రైతులు ఇప్పటికీ అంటున్నారు అయితే ఈ రైల్వే లైను వస్తే బద్వేలు నియోజకవర్గంలోని ముఖ్యంగా అట్లూరు మండలంలో చీని తోటలు అధికంగా ఉన్నాయి ఇక్కడ రైతులు రైల్వే మార్గంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రయోజనం మాత్రం లేకుండా పోయింది గతంలో ఈ లైన్ ఏర్పాటు చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ఎంతో ఆసక్తి చూపింది ఆ తర్వాత ప్రభుత్వం లేకుండా పోవడం భాకరాపేట – గిద్దలూరు రైల్వే లైన్ కూడా కాలగర్భంలో కలిసిపోయింది అయితే రెండు పర్యాయాలు పాలనలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఇప్పుడు ఈ రైల్వే మార్గం గురించి అసలు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *