ఉదయానందా హాస్పిటల్, రోటరీ క్లబ్ ఆఫ్ నంద్యాల ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన సదస్సు

సిరా న్యూస్,నంద్యాల;
పట్టణంలోని ఆర్ట్స్  కాలేజీలోనీ విద్యార్థినీ,విద్యార్థులకు ఉదయానందా హాస్పిటల్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ నంద్యాల ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు దండే దస్తగిరి తెలిపారు. ఈ సందర్భంగా దండే దస్తగిరి మాట్లాడుతూ మహిళలు సర్వైకల్ క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండి, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. సర్జికల్ ఆంకాలజిస్టులు డాక్టర్ సాయి ప్రణీత్, డాక్టర్ సుస్మిత, డాక్టర్ చేతన మాట్లాడుతూ ఉదయానందా హాస్పిటల్ లో క్యాన్సర్ ట్రీట్మెంట్ కు కావాల్సిన పరికరాలను రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్, రోటరీ క్లబ్ పి.డి.జి శ్రీ రామ్ మూర్తి, డిస్ట్రిక్ట్ సెక్రటరీ కైలాస నాథ్ రెడ్డి, రాధిక, మామిడి మధుసూదన్, లక్ష్మీనారాయణ, ఎల్.ఐ.సి వెంకటేశ్వర్లు,లెక్చరర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *