సిరా న్యూస్,విజయవాడ;
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాల్సిన వారి జాబితాలను విడుదల చేస్తున్నారు. ఇప్పటికి మూడు జాబితాలు విడుదల చేశారు. అయిేత విడుదల చేస్తున్న జాబితాలన్నీ పూర్తిగా మార్పు, చేర్పులకు సంబంధించినవే. జాబితాలో చోటు లేని వారు ఇప్పటికైతే సేఫ్గా ఉంటున్నారు. మందు ముందు కసరత్తులో వారి పేర్లు ఉంటాయా ఉండవా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. అయితే మార్పు చేర్పుల్లో సీట్లు కోల్పోయిన వారు.. సీట్ల మార్పిడికి గురైన వారిలో అసంతృప్త వాదులు ఇవి సమన్వయకర్తల నియామకం మాత్రమే అని.. అభ్యర్థులు కాదని తేల్చి చెబుతున్నారు. రెండు నెలల్లో ఏమైనా జరగొచ్చినా బీఫాం మాకే తప్పక వస్తుందని వారు దీమాగా ఉన్నారు. పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ కు టిక్కెట్లు నిరాకరించారు. వారి నియోజకవర్గాల్లో వేరే నేతలను సమన్వయకర్తలుగా ప్రకటించారు. అయితే వారు కంగారు పడటం లేదు. బలప్రదర్శన చేసేందుకు సిద్ధపడుతున్నారు. పార్టీ బలమే కాదని. తమ బలం కూడా ఉందని.. తమని కాదంటే పార్టీ గెలవదనే సంకేతాలు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో సమన్వయకర్తలుగా పేరు లేకపోయినా టిక్కెట్లు తమకే వస్తాయని వారు అనుచరులకు చెబుతున్నారు. కంగారు పడాల్సిన పని లేదని అంటున్నారు. తాజాగా కర్నూలు ఎంపీ సమన్వయకర్తగా నియమితులైన మంత్రి జయరామ్ కూడా తన అనుచరులకు అదే చెబుతున్నారు. ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరుతానని కార్యకర్తలు కంగారు పడాల్సిన పని లేదంటున్నారు. చివరికి నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత కూడా అభ్యర్థులను మార్చిన ఘటనలు ఉన్నాయంటున్నారు.ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే పాతుకుపోయి ఉంటారు. కొత్త నియోజకవర్గానికి వెళ్లాలంటే చాలా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలి. అక్కడ ఉండే క్యాడర్ ను తమ దారిలో నడిపించుకోవాలంటే వారి ఆశల్ని అంచనాల్ని అందుకోవాల్సి ఉంటుంది. అదేమంత చిన్న విషయం కాదు. వైఎస్ఆర్సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం తమ పార్టీ అధికారంలోకి వచ్చినా పెద్దగా ఏమీ ఒరగలేదన్న అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎంతోకొంత వెనుకేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇది కొత్త ఇంచార్జులక అవగతమవతోంది. అదే సమయంలో తమ నియోజకవర్గంలో పెంచుకున్న పట్టు, క్యాడర్ ను.. కొత్త నేతకు ధారదత్తం చేయడానికి సిద్ధంగా ఉండరు. అందుకే నియోజకవర్గం నుంచి వెళ్లేదమీ ఉండదని.. ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉన్నందున కంగారు పడాల్సిందేమీ లేదని అంటున్నారు. తాము ఉన్న నియోజకవర్గం నుంచే పోటీ చేస్తామని చెబుతున్నారు. తాము సహకరించకపోతే పార్టీ గెలవదన్న విషయాన్ని హైకమాండ్ కు బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారువైఎస్ఆర్సీపీ హైకమాండ్ కూడా వీరందర్నీ నియోజకవర్గ సమన్వయకర్తలుగానే చెబుతోంది. అభ్యర్థులుగా చెప్పడం లేదు. కానీ సమన్వయకర్తల్ని అభ్యర్థులుగానే ట్రీట్ చేస్తోంది. వారు ప్రజల్లోకి వెళ్లాలని .. గడప గడపకూ తిరగాలని చెబుతోంది