సిరా న్యూస్,తాడేపల్లి;
ఉండవల్లిలోని రామకృష్ణ ధియేటర్ వద్ద రాజధాని రైతులు, రైతు కూలీలు, టీడిపి నాయకులు నిరసనకు దిగారు. రాజధాని ఫైల్స్ సినిమా నిలిపివేయడంతో నిరసన ప్రకటించారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని ఫైల్స్ సినిమాని ధియేటర్ యాజమాన్యం నిలిపివేసింది. రైతులను భయపడ్డ సీఎం అంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేసారు. వైసీపీ నాయకులు రైతులకు భయపడి ఉద్దేశ్యపూర్వకంగానే కోర్టులో పిటిషన్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు..