సిరా న్యూస్,అనంతపురం :
గుత్తి మండలం బాచుపల్లి గ్రామ సమీపంలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీ డీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగావుంది. మృతులు అనంతపురం రాణి నగర్ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను గుత్తి ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..