సిరా న్యూస్,హైదరాబాద్;
ఎల్బీనగర్ లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.రంగారెడ్డి కోర్టు సమీపంలో కార్ యూటర్న్ చేస్తు రాంగ్ రూట్ లో వెళ్లగా ఒక్కసారి గా కారును బైక్ ఢీ కొట్టింది.బైక్ పై ఉన్న ఒక్కరు మృతి చెందాగా మరొకరికి ఒక్కరికి గాయాలయ్యాయి.మృతి చెందిన వ్యక్తి చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సీఐ సాదిక్ అలీగా, గాయలైన వ్యక్తి నారాయణ గూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నా ఎస్.ఐ కాజా వల్లి మోహినుదిన్ గా పోలీసులు గుర్తించారు.సీఐ సాదిక్ అలీ,ఎస్.ఐ కాజా వల్లి మోహినుదిన్ మలక్ పేట్ లోని ప్రభుత్వ కోటర్స్ లో ఉంటున్నారు.ఎల్బీనగర్ లో ఓ ఫంక్షన్ కి వెళ్లి మలక్ పేట్ లోని కోటర్స్ కి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.