నిందితులను రిమాండ్ కు తరలింపు
సిరా న్యూస్,గన్నవరం;
గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో నిందితులను పోలీసులు కోర్ట్ లో హాజరు పర్చారు. వైద్యపరీక్షల అనంతరం 15మంది నిందితులను కోర్ట్ కు తీసుకొచ్చారు. దాడి కేసులో సీసీ ఫుటేజ్, వీడియోల ఆధారంగా గుర్తించిన 93 మందిలో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో15 మంది నిందితులను ప్రవేశపెట్టారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు రిమాండ్ ను సివిల్ జడ్జి కోర్టు పరిశీలించారు. ఈనెల 24వ తారీఖు వరకు 14 రోజులు రిమాండ్ విధించారు. దాంతో నిందితులను నూజివీడు జైలుకు తరలించారు.
========