సిరా న్యూస్,చిత్తూరు;
ఎన్నికల నియమావళి ఉల్లంఘన పై పలమనేరు వైసిపి ఎమ్మెల్యే వెంకటేగౌడ కు షో కాజ్ నోటీస్ అధికారుల పంపారు. వి.కోట కి సంబంధించిన పదో తరగతి పరీక్షల ఇన్విజిలేటర్లు కు కూడా మెమోలు జారీ చేశామని ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండగా అతని ఫోటోలు ఉన్న ప్యాడ్లను విద్యార్థులకు అందించిన ఘటనపై కేసు నమోదు చేసారు.న పార్టీలకు చెందిన వ్యక్తుల విద్యాసామగ్రిని పరీక్ష కేంద్రంలోనికి విద్యార్థులు తీసుకెళ్లడం పై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యారు. ఇదే అంశాన్ని సోమవారం పలమనేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో గమనించిన పరీక్షల పర్యవేక్షకులు పలమనేరు ఆర్డిఓ కు నివేదిక అందించారు. ఇదే అంశాన్ని పలు న్యూస్ కథనాలు రావడంతో స్పందించిన ఎన్నికల కమిషన్ చర్యలకు ఆదేశించింది.. ఈ మేరకు పలమనేరు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ మనోజ్ రెడ్డి ఫిర్యాదు మేరకు వి.కోట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 75 / 2024 ipc 188.171H గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎవరెవరు రైటింగ్ ప్యాడ్ లో పంచారు, వారిని గుర్తించి ఈ కేసులో నమోదు చేస్తామని ఎన్నికల అధికారి తెలిపారు. అలాగే పలమనేరు ఎమ్మెల్యేకు సంబంధించిన సామాగ్రి కావడంతో అతనికి శోకజ్ నోటీసు ఇచ్చామని రెండు రోజులు గడువు ఇచ్చామని సంజాయి చర్యలు తీసుకుంటామని ఆర్డిఓ మనోజ్ రెడ్డి పలమనేరులో విలేకరుల సమావేశంలో వెల్లడించారు..