సిరాన్యూస్, ఖానాపూర్:
రూ.2లక్షల నగదు పట్టివేత
ఎన్నికల నియమాళి ప్రకారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లో మంగళవారం బాధనకుర్తి చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి సరైనా ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వలన భూపాలపల్లి జిల్లా కు చెందిన మొగులి శ్రీనివాస్ వద్ద రూ.2లక్షల నగదు పట్టుకోవడం జరిగింది. ఖానాపూర్ సిఐ, ఎస్ఐ, ఎస్ ఎస్ టి టీం ఇంచార్జ్ సిహెచ్, ప్రశాంత్, హెడ్ కానిస్టేబుల్ ఎర్రన్న, పి సి ఎస్, రవీందర్, సతీష్, కుమారస్వామి ఉన్నారు.